7 April, 2026 | 11:17 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

రూ.43 లక్షలతో అభివృద్ధి పనులు

10-01-2026 12:00 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్, జనవరి 9 (విజయ క్రాంతి): ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడ లో గల మినర్వ కాంప్లెక్స్ సమీపంలో 43 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, వాటర్ లైన్ ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, అమీర్ పేట సర్కిల్ డి సి సుజాత, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, ఆరీఫ్, శేఖర్, సాబెర్, భరత్, ఆకుల హరికృష్ణ, కె.కిషోర్, నార్ల దీపక్ తదితరులు ఉన్నారు.