17-10-2025 12:28:12 AM
కోయిల్ కొండ, అక్టోబర్ 16: మండల నూతన ఎంపీడీవో గా ధనుంజయ గౌడ్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. నూతన ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించడంతో కార్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీవోని కలిసి శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అందరం సమిష్టిగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీడీవో ధనుంజయ గౌడ్ సూచించారు.