15 June, 2026 | 2:55 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

డ్రైనేజీ నిండి ఇండ్ల ముందుకు చేరిన మురికి నీరు

28-01-2026 10:37 AM

బెజ్జూర్ జనవరి 28 (విజయ క్రాంతి): కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీ నగర్ లో డ్రైనేజీ నుండి ఇండ్ల ముందుకు మురికి నీరు చేరిందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి మురికి నీరు ఇండ్ల ముందుకు చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల ముందుకు మురికి నీరు చేరడంతో కాలనీవాసులు రోడ్డుమీద నిరసన తెలిపారు.గత కొన్ని రోజుల నుండి డ్రెయినేజీ నిండి ఇండ్ల లోకి మురుగు నీరు వస్తుందని మునిసిపల్ అధికారుల చెప్పిన పట్టించుకోవడం లేదని దీనితో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని నిరసనకు దిగినట్లు తారని ప్రజలు తెలిపారు.