వ్యక్తి అదృశ్యం
30-10-2025 08:25 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన అక్కినపల్లి కిషోర్ ఈ నెల 26వ తేదీ మధ్యాహ్న సమయంలో తన ఇంటి వద్ద నుంచి బైక్పై మణుగూరు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతని ఆచూకీ ఇప్పటివరకు తెలియక పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అశ్వాపురం పోలీసు స్టేషన్లో అదృశ్యమయ్యాడనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి సంబంధించిన ఏవైనా వివరాలు గానీ, ఆచూకీ గానీ తెలిసినవారు క్రింది నంబరుకు సంప్రదించవచ్చని అశ్వాపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 87126 82093






