30-10-2025 08:32:24 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత వాడలో గల శివాలయంలో గురువారం రాత్రి కార్తీక మాసమును పురస్కరించుకొని కార్తీకమాస విశిష్టత సప్తహ ప్రవచనం కార్యక్రమం ప్రారంభమైంది. ధర్మచార్యులు ఎనుగంటి రామ్మోహన్ రావు ప్రవచనంలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ పెద్దపెల్లి జిల్లా ధర్మచార్యులు మేంగాని చంద్రశేఖర్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్లకొండ మఠం మహేష్, భక్త బృందం పాల్గొన్నారు.