6 June, 2026 | 11:52 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

25-10-2025 06:08 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను తహశీల్దార్ రఫతుల్లా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన 38 (బీసీ (BC) 23, ఎస్సీ (SC) 6, మైనార్టీ (MINORITY) 6, ఈబీసీ (EBC) 2, ఎస్టీ (ST) 1) మంది లబ్ధిదారులకు రూ. 38,04,408 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు అందజేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.