10-07-2025 11:04:44 PM
జి.సుధీర్ బాబు, ఐపీఎస్, సిపి రాచకొండ..
ఇబ్రహీంపట్నం: బెగరికంచ గ్రామంలోని ఏటీసీనీ గురువారం రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఐపీఎస్(CP Sudheer Babu IPS) సందర్శించడం జరిగింది. అక్కడ ఫార్మా సిటి రైతులకు పంపిణీ చేస్తున్న ప్లాట్లను, అదేవిధంగా బందోబస్తును పరిశీలించి ఆయన అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ లను, గ్రీవిఎన్స్ కౌంటర్లను సీపీ స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్లాట్లు పంపిణీ పారదర్శకముగా ఉండాలని అన్నారు.
ఎటువంటి గ్రీవెన్స్ వచ్చాయో కూడా రిజిస్టర్ను చెక్ చేసి ఏదైనా సమస్య వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, దళారుల చేతిలో మోసపోకూడని రైతులకు సూచనలు చేశారు. శాంతి బద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపితో పాటు మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, హైద్రాబాద్ గ్రీన్ ఫార్మసిటీ ఇన్స్పెక్టర్ లిక్కి కృష్ణం రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.