22 May, 2026 | 9:59 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డుల పంపిణీ

11-08-2025 05:45 PM

10 సంవత్సరాల బీఆర్ఎస్ ఒక రేషన్ కార్డు పంపిణీ చేయలేదు..

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Laxmi Kantha Rao) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను, నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు గొప్ప పథకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  కొంగల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్, తాహసిల్దార్ వేణుగోపాల్ ,ఎంపిడివో గోపాలకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.