24-05-2025 07:24:52 PM
ములుగు/మహబూబాబాద్ (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్పీ ఎదుట గత ఏప్రిల్ 11న లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులకు సరెండర్ పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన పరిహారాన్ని ఎస్పీ డాక్టర్ శబరీష్(SP Dr. Shabarish) అందజేశారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మడవి మంగిలి, దూది జయరాంకు చెరో 25 వేల చొప్పున పరిహారం చెక్కులను ఎస్పీ అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలసీని వినియోగించుకొని ప్రశాంత జీవనం సాగించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.