17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళలకు చీరల పంపిణీ

12-05-2025 01:44 AM
  1. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహణ
  2. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని బీకేగూడ ప్రాంతంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 80 మందికి ఎత్తు, బరువు, బీపీ, రక్తపోటు, మధుమేహం, ఎస్పీఓ2, హెమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందించారు.

దాంతోపాటు శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు, ఆస్టర్ డీఎం ఫౌండేషన్ సంయుక్తంగా 300 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఫైనాన్స్ విభాగాధిపతి జె ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస సమాజసేవ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.