15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కొలువుదీరిన తహసిల్దార్లు

19-05-2025 11:09 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): లోక్ సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో పనిచేసిన తహసిల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ప్రభుత్వం ఇటీవల తిరిగి వారిని సొంత జిల్లాలకు పంపింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు కేటాయించిన తహసిల్దార్లకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పోస్టింగ్ ఇచ్చారు.

ఇందులో కేసముద్రం తహసిల్దారుగా జీ.వివేక్, నెల్లికుదురుకు సిహెచ్. నరేష్, గూడూరుకు ఎన్. నాగభవాని, నరసింహులపేటకు జీ.రమేష్ బాబు, డోర్నకల్ కు ఏం. ఇమ్మానుయేల్, సీరోల్ కు ఏ.పూర్ణచందర్ ను నియమించగా ఈ మేరకు వారు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే జిల్లాలో పలువురు తహసీల్దారులను కలెక్టర్ బదిలీ చేశారు. ఇందులో చంద్ర రాజేశ్వర్ గూడూరు నుండి మహబూబాబాద్ కు, సిహెచ్. నాగరాజు నర్సింహులపేట నుంచి బయ్యారం, బి.విజయ బయ్యారం నుంచి కురవి, కే. రాజు నెల్లికుదురు నుంచి కొత్తగూడకు బదిలీ అయ్యారు.