14-10-2025 10:05:43 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): దీపావళి బోనస్ లు ముందుగానే చెల్లించాలని బిఏంఎస్ నాయకులు సైదులు డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో బిఎంఎస్ పెద్దన్న పాత్ర వహించి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి జోక్యంతో గతంలో ఇచ్చిన రూ.93,750 లకు రూ.9,250 పెంచి పిఎల్ఆర్ బోనస్ రూ.1,03,00 ఇవ్వడం జరిగిందన్నారు. ఈసారి కూడా దీపావళి పండుగకు ముందుగా బోనసులు చెల్లించాలని బిఎంఎస్ తరపున డిమాండ్ చేశారు.