28-04-2025 08:49:09 PM
సొసైటీ చైర్మెన్ ఏగుల...
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టించి పండించిన జొన్నపంటను దాళారులకు అమ్మొద్దని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని బిక్కనూర్ లో ఏర్పాటు చేసిన జొన్నల సబ్ సెంటర్ ను సొసైటీ చైర్మెన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లోనే జొన్న అమ్మి గిట్టుబాటు ధర పొందాలని జొన్న రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు సాయిరెడ్డి, బాపురెడ్డి, శ్రీకాంత్, మహేందర్, మైసయ్య రైతులు పాల్గొన్నారు.