3 July, 2026 | 10:07 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సామాజిక న్యాయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?

03-05-2025 01:01 AM

ఎమ్మెల్సీ కవితను నిలదీసిన విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా.. సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం స్పం దించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పు డు సబ్బండ వర్గాలకు కవిత ఎందుకు అండ గా నిలబడలేదని, అధికారం దూరమయ్యాక ఇప్పుడు అందరూ గుర్తుకువచ్చారా అని నిలదీశారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ హయంలో పందికొక్కుల్లా ప్రజాధనం దోచుకున్నప్పు డు కవితకు సోయి లేదా అని మండిపడ్డారు. సీఎం, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, మంత్రి పదవులు ఓసీ వర్గం వద్ద ఉన్నప్పుడు కవితకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.