24 June, 2026 | 3:10 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

ఆంగ్ల అధ్యాపకుడికి డాక్టరేట్ ప్రదానం

26-11-2025 08:48 PM

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంగ్ల అధ్యాపకుడు ఎండి మహబూబ్ పాషా ప్రతిష్ఠాత్మకమైన సన్‌రైజ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ బిరుదును అందుకుని విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో ప్రముఖ కవుల కవిత్వం, వారి రచనా శైలి, భావవ్యక్తీకరణ, సాహిత్య సామాజిక సందర్భాలపై ఆయన చేసిన లోతైన పరిశోధనను విశ్వవిద్యాలయం అత్యంత ప్రశంసించింది. భాషపై తనకున్న అభిరుచి, సాహిత్యంపై అపారమైన ప్రేమే ఈ పరిశోధనకు ప్రేరణయి నిలిచిందని డా.మహబూబ్ పాషా తెలిపారు. విద్యార్థులకు బోధన చేస్తూనే తన శాస్త్రీయ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేయడం సవాలుతో కూడుకున్నదైనా, అది తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఆంగ్ల సాహిత్యం పట్ల యువతలో ఆసక్తి పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా తన పరిశోధన ప్రయాణంలో తోడ్పాటును అందించిన గురువులకు, సహచర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే అన్ని సందర్భాల్లో ధైర్యం నింపుతూ నిలిచిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  విద్యారంగానికి తన వంతు సేవలను మరింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, సహచర ఉపాధ్యాయులు ఆయనకు ఈ విజయంపై అభినందనలు తెలియజేశారు.