25-10-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, అక్టోబర్ 24 : ఆసుపత్రుల్లో వై ద్యులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని సర్దన గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్ హాజరు పు స్తకాలను, మందులను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వైద్యులందరూ తప్పకుండా సమయపాలన పాటిం చాలన్నారు. పేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందాలన్నారు. అందుబాటులో అ న్ని రకాల మందులు కలిగి ఉండాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.