calender_icon.png 1 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ప్రతి ఒక్కరి కర్తవ్యం

29-05-2025 12:00:00 AM

- డాక్టర్ శ్రీకాంత్ వోడ్నాల

- టీఎక్స్ హాస్పిటల్స్, బీఎన్‌ఐ ప్లాటినమ్ చాప్టర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హైదరాబాద్, మే 28: సేవాభావంతో కూడిన సామాజిక బాధ్యతను చాటుతూ బీఎన్‌ఐ ప్లాటినమ్ చాప్టర్, టీఎక్స్ హాస్పిటల్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లోని హాం ప్‌షైర్ ప్లాజా హోటల్‌లో బుధవారం రక్తదా న శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో బీఎన్‌ఐ ప్లాటినమ్ సభ్యులైన వ్యాపార యజ మానులు,హాంప్‌షైర్ ప్లాజా హోటల్ సిబ్బం ది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ప్రదీప్‌గాంధీ, కే రుషికేశ్, వీ ప్రణీత్,  టీఎక్స్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ వోడ్నాల శిబిరాన్ని సందర్శించి అనంతరం మాట్లాడారు.

ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానం ప్రతీ ఒక్కరి కర్తవ్యంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమం  వ్యాపారవేత్తలు, ఆరోగ్య సంస్థల మధ్య భాగస్వామ్యం ఎంత ప్రజోపయోగంగా ఉంటుందో సూచిస్తోందన్నారు.రక్తదానం చేయడం ద్వారా అనేకమం ది రోగులకు కొత్త ఆశను అందించగలుగుతారని చెప్పారు. వ్యాపారవర్గాలు తమ సామాజిక బాధ్యతను చాటుకోవడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన కొనియాడారు.