29-05-2025 12:00:00 AM
-పుష్కరాలతో సహా 64 రోజులకు లెక్కింపు
కాళేశ్వరం(మహబూబాబాద్), మే 28 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయ హుండీ ఆదాయన్ని బుధవారం లెక్కించారు.
12 రోజుల పాటు నిర్వహించిన సరస్వతీ పుష్కరాలతో సహా 64 రోజులకు రూ.2.83 కోట్లు వచ్చిన ట్టు ఆలయ ఈవో ఎస్ మహేష్, దేవాదా య శాఖ సహాయ కమిషనర్ ఆర్ సునిత తెలిపారు. హుండీ ద్వారా రూ.1,36,28, 099 ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1,38,36, 552, గదుల అద్దె ద్వారా రూ.1.71 లక్షలు, హోమాల ద్వారా రూ.1.23 లక్షలు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ.5.60 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు.
అలాగే 15 గ్రాము ల మిశ్రమ బంగారం, 1.75 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సూపరిండెంట్ బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.