18 July, 2026 | 12:18 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

25-09-2025 12:39 AM

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్

మిడ్జిల్, సెప్టెంబర్ 24 : రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు గురి చేయకూడదని వాస్తవ పరిస్థితులను వారి ముందు ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. బుధవారం మండలంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేసి ఎరువుల స్టాక్ రిజిస్టర్ ఫార్మర్ సెల్ రిజిస్టర్ బిల్ బుక్ లను పరిశీలించారు. స్టార్ట్ బోర్డు తప్పనిసరిగా ప్రతిరోజు అప్లైట్ చేయాలని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని దుకాణదారులకు సూచించారు.

మండలానికి 90.45 టన్నుల యూరియా వచ్చిందన్నారు. రైతులు ఎవరు అధైర్య పడద్దని అందరికీ యూరియా దొరుకుతుందన్నారు. అలాగే రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాని తగ్గించాలని తెలిపారు. ప్రవేట్ ఎరువుల డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించవద్దని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, భగత్, తదితరులు ఉన్నారు.