25-09-2025 12:40:32 AM
వెల్దండ సెప్టెంబర్ 24 నియోజకవర్గంలోని ప్రతి పౌరుడికి వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పలుకు తండాలో బుధవారం మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో నిపుణులైన వైద్యులచే 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అందించి వారికి మందులు పంపిణీ చేసి సలహాలు సూచనలు చేశారు కార్యక్రమంలో నాయకులు నారాయణ, రవీందర్ తదితరులుపాల్గొన్నారు.