calender_icon.png 11 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ వెంకటేశ్వర్

10-07-2025 05:46:18 PM

కామారెడ్డి (విజయక్రాంతి): జీజీహెచ్ సూపరింటెండెంట్​గా డాక్టర్​ వెంకటేశ్వర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇన్​ఛార్జీగా పనిచేసిన డాక్టర్​ ఫరీదా బేగం నూతన సూపరింటెండెంట్​గా వచ్చిన డాక్టర్​ వెంకటేశ్వర్​కు బాధ్యతలు అప్పగించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సూపరింటెండెంట్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ మాట్లాడుతూ,  ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.