31-05-2025 12:27:14 AM
పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు
జిల్లా కలెక్టర్ ముజ్ముల్ ఖాన్
సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
కల్లూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాలు ప్రాజెక్ట్, కనిగిరి గుట్టలు , విరభద్రస్వామి ప్రాచీన గుడి కట్టడాలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎకో టూరిజం ఏర్పాటు చేయుటకు ఆ ప్రాంతాలని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...సత్తుపల్లి నియోజకవర్గం లో పులిగుండాల అటవీ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గొప్ప టూరిజం ప్రాంతం గా తీర్చు దిద్దుతాము అని తెలిపారు.
ప్రస్తుతం సుమారు రూ 4.5 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు పర్యాటకులు 2,3 రోజులు ఇక్కడే వుండే విధంగా రూమ్స్, హోటల్స్, ఆహ్లాద కరమైన ఏర్పాట్లు, బోటింగ్ ఏర్పాట్లు చెయ్య నున్ననట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం లో నీలాద్రి గుడి అటవీ ప్రాంతం కూడా మంచి టూరిజం ప్రాంతం గా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం ను సంక్షేమ అభివృద్ధి లో ,గొప్ప టూరిజం ప్రాంతం గా అభివృద్ధి చేస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టి, తుమ్మల కి, పొంగులేటి కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు, సత్తుపల్లి నియోజకవర్గం ప్రభుత్వ అధికారులు, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్,ఫారెస్ట్డ,డీ యఫ్ వో, సీసీ,యఫ్ డి వో, ఆర్ డి వో, ఏసీపీ, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.