calender_icon.png 1 June, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ చాటిన మణికొండ కూచిపూడి విద్యార్థులు

31-05-2025 12:26:53 AM

మణికొండ మే 30 : ఈ నెల 24, 25, 26 తేదీలలో ఏపీలోని చిలకలూరిపేట కళానిలయం నిర్వహించిన జాతీయస్థాయి 40వ వార్షికోత్సవ నృత్య పోటీల్లో మణికొండ విద్యార్థులు ప్రతిభ చాటారు. మణికొండ వాస్తవ్యులు కూచిపూడి నాట్య గురువు అక్కుల శ్రీనివాస్ శిష్య బృందం పెద్ద సంఖ్యలో అవార్డులు గెల్చుకుంది. 

ఈ బృందంలోని జోషిత, హరిద్రియ, హర్షిత, రేఖ, శ్రీప్రజ్వల, శరణ్య, అభిజ్ఞ, తష్విక, భువిక, నికిత, తేజస్విని, మధురిమ, విశ్రుత్ బృందం అద్భుత నాట్య ప్రతిభతో ఆకట్టుకున్నారు. కుందన్ కుమార్ ముఖ్య అతిథులు మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, బి.సాయి రెడ్డి, ఎస్.కిరణ్,  డి.లక్ష్మణ్, కె. దిలీప్ పాల్గొన్నారు.

శ్రీ ఇంద్రసింహ కూచిపూడి నాట్య భారతి మణికొండ నాట్య కళాశాల విద్యార్థులపై బహుమతుల వర్షం కురిసింది. మహిషాసుర మర్దిని నృత్య నాటికకు ప్రథమ బహుమతి, నృత్యథి అనే జంట నాట్యానికి ప్రథమ బహుమతి, బ్రహ్మాంజలి అనే నృత్యంశానికి ద్వితీయ బహుమతి, ప్రహ్లాద పట్టాభిషేకానికి మూడవ బహుమతి, 10 జూరీ అవార్డులు లభించాయి. ఈ విద్యార్థులు చూపించిన ప్రతిభతో గురువు శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవాలను కళాభారతి వారి ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది.