03-06-2025 01:38:08 AM
- జపాన్ ‘కితాక్యూషూ సిటీ’ స్ఫూర్తితో అభివృద్ధి
- ఏడాదిన్నరలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు
-హైదరాబాద్ నుంచి కితాక్యూషూకు విమాన సర్వీసులు
-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి) : భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా జపాన్లోని ‘కితాక్యూషూ సిటీ’ స్ఫూర్తితో 80 ఎకరాల్లో ఎకో టౌన్ను అభివృద్ధి చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు.
తెలంగాణ, కితా క్యూషూ నగరం మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సోమవారం టీ ‘ఫ్రం కితాక్యూషూ టూ తెలంగాణ ః కేటలైసింగ్ సస్టునబుల్ ఇండస్ట్రీయల్ గ్రోత్’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా ఏర్పాటుచేసిన సదస్సుకు శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా మార్చాలన్నదే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీ య కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు ల భించాయని, మరింత మందికి ఉపా ధి దక్కేలా టాంకాం లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్ భాషను నేర్పిస్తామన్నారు. రాబోయే రోజు ల్లో నెట్ జీరో లక్ష్యాలు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సర్క్యులర్ ఎకానమీ, క్లీన్ టెక్నాలజీస్, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర అంశాల్లో కితాక్యూషూ నగరంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చే యనున్న ఫ్యూచర్ సిటీని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ఇండ స్ట్రీయల్ జోన్స్ ఏర్పాటు, జీరో వేస్ట్ డిజైన్, అత్యాధునిక వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులకు ప్రా ధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య సత్సంబంధాలు మరింత పెరిగేలా హైదరా బాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు గత సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేయిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల తలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా జపాన్ పారిశ్రా మిక వేత్తలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, సీఈవో మధుసూదన్, రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ అవినాష్, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.