calender_icon.png 4 June, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు

03-06-2025 01:35:35 AM

- 9న విచారణకు హాజరుకానున్న హరీశ్

- నోటీసుల నేపథ్యంలో పలుమార్లు భేటీఅయిన కేసీఆర్, హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు మేడి గడ్డ బరాజ్ కుంగుబాటుపై విచార ణ చేస్తున్న జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ ముందుకు ఈనెల 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

కేసీఆర్, హరీశ్, ఈటల విచారణకు హాజరుకావాలని క మిషన్ నోటీసులను జారీ చేసిన వి షయం తెలిసిందే. దీనిలోభాగంగా ఈనెల 5వ తేదీన హాజరుకావాలని కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇ చ్చింది. ఈనేపథ్యంలో తాను 11వ తేదీన విచారణకు హాజరవుతానం టూ కమిషన్‌కు కేసీఆర్ సమాచారం ఇచ్చారు. దీనికి కమిషన్ అంగీకరించినట్లు తెలిసింది.

నోటీసుల నేప థ్యంలో కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాళేశ్వరం ఎన్డీఎస్‌ఏ నివేదికపై హరీశ్‌రావుతో పలుసార్లు భేటీ అయ్యారు. కమిషన్ ముందు వివర ణ ఇచ్చే అంశాలపై ఇంజినీరింగ్, వ్య వసాయ, న్యాయనిపుణుల సూచనలు, అభిప్రాయాలను తీసుకున్నా రు.

ఈక్రమంలో సోమవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ, ఈ కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. హరీశ్‌రావు ఈనెల 9న కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. 

రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్ దూరం

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు దూ రంగా ఉన్నారు. కాగా, అవతరణ ది నోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీమంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.  

రాష్ర్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు

దశాబ్దాల కాలపు కొట్లాటకు, నా లుగు కోట్ల ప్రజల తండ్లాటకు విము క్తి లభించిన రోజని సోమవారం ఎక్స్ వేదికగా మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రజ లకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.