27 July, 2026 | 12:52 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

విద్యార్థిని అభినందించిన విద్యాధికారులు

30-12-2025 10:00 PM

చిట్యాల,(విజయక్రాంతి): గణిత ప్రతిభ పోటీలలో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైన విద్యార్థిని, ఉపాధ్యాయులను విద్యాధికారులు మంగళవారం అభినందించారు. జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయిలో దశరథ ఫౌండేషన్ వారి సహకారంతో టీఎంఎఫ్ నల్గొండ వారు నిర్వహించిన గణిత ప్రతిభ పోటీ పరీక్షలలో నల్లగొండ డివిజన్ స్థాయిలో జడ్.పి.హెచ్.ఎస్ చిన్నకాపర్తి చిట్యాల మండలం కు చెందిన పదవ తరగతి విద్యార్థి బి.దీపక్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి బి.బిక్షపతి చేతుల మీదుగా సర్టిఫికెట్, మెమెంటో, క్యాష్ ప్రైజ్  ను అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చిట్యాల మండల విద్యాధికారి పి.సైదానాయక్ మాట్లాడుతూ... నల్గొండ డివిజన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన బి.దీపక్ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా మంచి ర్యాంక్  రావాలని కోరారు. ఈ సందర్భంగా మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా అభినందించారు. అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులు ఇటీవల వివిధ స్థాయిలలో మరియు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో రానించడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు.