25-09-2025 08:36:01 AM
ఒకరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు
మేడిపల్లి, (విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారాపల్లి మధు బాయ్స్ హాస్టల్ లో సీనియర్స్ ర్యాగింగ్ తో బీటెక్ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్యకు కారణమైన 9 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మేడిపల్లి పోలీసులు శివకుమార్ యాదవ్, గంగినేని ప్రశాంత్, బుర్ర రోహిత్, చిదారి మురళీధర్, వడ్డం సాయి ప్రసాద్ లను మంగళవారం నాడు, ఇస్మాయిల్, మని వర్మ, పైసల్ లను బుధవారం నాడు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా ఒక నేరస్థుని గురించి ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నాము అని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.