పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు పాటించాలి: సీఐ వెంకట్ రెడ్డి
07-12-2025 08:04 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.




