10 April, 2026 | 8:34 PM

Breaking News

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •  

సీఎంతో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు సమావేశం

06-10-2025 01:57 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఎలి లిల్లీ అనే సంస్థ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.9 వేల కోట్లతో ప్లాంటు, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత చేసింది. ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు(Eli Lilly representatives) ఐసీసీసీలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revantha Reddy)తో సమావేశమయ్యారు. నగరంలో ఎలి లిల్లీ సంస్థ(eli lilly company)ను ఏర్పాటు చేసేందుకు ముందుకోచ్చిన ప్రతినిధులను సీఎం అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని, ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జినోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆనంద్ మహేంద్ర నేతృత్వంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పార్మ్ ప్రముఖులు స్కిల్ వర్సిటీ బోర్డు సభ్యులుగా ఉన్నారని సీఎం వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలి లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ హాజరయ్యారు.