06-10-2025 03:05:33 PM
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా లో విద్యుత్ ప్రమాదంతో ఐశ్వర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో ఉన్న యంత్రాలు కాలి బూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామంలో ఉన్న ఐశ్వర్య ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వలన రైస్ మిల్ లో ఉన్న మిషన్స్ సామాగ్రి పూర్తిగా ఖాళీ పోవడంతో దాదా 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైస్ మిల్ యజమాని నంద కిషోర్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.