1 April, 2026 | 1:35 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

01-12-2024 04:21 PM

పటాన్ చెరు (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మండల స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. 'పునరుద్ధరించే ఇంధన వనరుల వినియోగం' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి భాను ప్రకాష్ ప్రథమ, 10వ తరగతి విద్యార్థి కిరణ్ కుమార్ ద్వితీయ, కస్తూర్బా పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శిరీష తృతీయ బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కుమారస్వామి, గిరిజన గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వెంకటయ్య, జిన్నారం పాఠశాల పీడీ రవీందర్ రెడ్డి, వేణు, సీఆర్పీ భాస్కర్ పాల్గొన్నారు.