calender_icon.png 30 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నా.. పట్టింపేదీ?

29-05-2025 12:03:45 AM

- బాసర గోదావరి వద్ద కనిపించని రక్షణ చర్యలు

- పుష్కర ఘాట్ల వద్ద ప్రమాద ఘటికలు

- ప్రతిఏట 20 మంది మృతి

నిర్మల్, మే 28 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి ఆలయమైన బాసర గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన భక్తులకు భద్రత కరువైంది. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశత్తు మునిగి ప్రా ణాలు పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నా యి.

బాసర నిజామాబాద్ ఆదిలాబాద్ మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడం ఇక్కడ సరస్వతి అమ్మవారు దేవాలయం ఉండడం రైల్వే స్టేషన్ త్రిఫుల్ ఐటీ వంటి ప్రధాన సం స్థలు ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

బాసర వద్ద నిజామాబాద్ రోడ్డుకు ఆనుకొని బాసర టెంపుల్ రోడ్డు వరకు పుష్కర ఘట్టాలు ఉన్న అక్కడ భద్రతా చర్య లు లేకపోవడంతో నీటిలో దిగిన భక్తులు నీటి లోతు ప్రభావం తెలియక అందులో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు రోజుల క్రితమే మహారాష్ట్రకు చెందిన సాహె బ్ దేశ్ముఖ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్ల రాజు గంట వ్యవధిలోని ఇద్దరు నీటి లో మునిగి కుటుంబ సభ్యుల ఎదుటనే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

గోదావరి నదిపై రైల్వే బస్సు లైన్ బ్రిడ్జిలు ఉండడంతో ఇంట్లో గొడవలు పెట్టుకుని బాసర వద్దకు వచ్చి గోదావరి నది లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వారి సంఖ్య కూడా నెలలో ఐదు నుంచి ఆరు ఉం టున్నారు.

బాసర క్షేత్రంలో తమ పిల్లలను అక్షరాభ్యాసం చేసుకునేందుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ బోకర్ నాందేడ్  లాథూర్ పూణే హిమాయత్ నగర్ నర్సినాయగావ్ బిలోలీ బెగ్లూర్ తదితర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వీరం తా తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, అమ్మవారి మొక్కులు తెలుసుకోవడం కోసం ముందుగా బాసర చేరుకొని పవిత్ర స్నానాలు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నాడు సంప్రదాయంగా వస్తుంది

రక్షణ చర్యలు శూన్యమే..

బాసర గోదావరి వద్ద భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ స్నానా ఘట్టాల వద్ద రక్షణ చర్యలు మాత్రం తగిన స్థాయిలో లేవని భక్తు లు మండిపడుతున్నారు. గోదావరి తీరం వద్ద మూడు చోట్ల పుష్కర స్నాన ఘట్టాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఒకటి నిజామాబాద్ మార్గం కు దగ్గర్లో మరో రెండు గంగా మాత సమీపంలో నిర్మించారు.

అయితే పుష్కర ఘాట్ల వద్ద నీటి ప్రభావంతో నల్ల మట్టి పేరుకుపోవడంతో పుష్కర్ ఘాట్ లో మెట్లపై స్నానాలు చేసే భక్తులు కాలుజారి నీటిలోకి జారుకుంటున్నారు. పుష్కర ఘా ట్లు అడుగుభాగంలో కోతకు గురి కావడం నల్ల మట్టి దిబ్బలు ఏర్పడం తో స్నానం ఆచరించే భక్తులు పిల్లలు మహిళలు అక్కడి పరిస్థితులు తెలియక నీటిలో దిగిన వెంటనే ప్రమాదాల గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

మొదటి పుష్కర్ ఘాట్ వద్ద భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల కొత్తవారికి నీటితో లోతు తెలియక అక్కడ స్నానం చేస్తూ నీటిలో గల్లత్తు అవుతున్నారు. ఏళ్ల తరబడి పుష్కర ఘాట్‌ల వద్ద మట్టిదిబ్బలను తొలగించకపోవడం పుష్కర  కింద కోత లోతు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గజ ఈతగాళ్లు ఉండకపోవడం భక్తులు నీటి లోతు తెలియక నోరుకి వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.

శుక్రవారం పండుగలు అమ్మవారి ముఖ్యమైన దినాల్లో దేవాదాయ శాఖ పోలీ స్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసిన మిగతా రోజుల్లో బందోబస్తు లేకపోవడంతో సూచనలు సలహాలు ఇవ్వకపోవడంతో ఇటువం టి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. 

ఎస్పీ ఆదేశాలు అమలవుతున్నాయా?

బాసర గోదావరి వద్ద ఆత్మహత్యల యత్నాలు బాసర గోదావరిలో ప్రమాదవశత్తు పడి భక్తుల మృతి నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ జానకి షర్మిల మూడు నెలల క్రితమే ప్రకటించారు. దైవ దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటి ప్రభావంలో కొట్టుకపోగా తండ్రి కూతు రు మరణించగా భార్య ప్రాణాలతో బయటపడింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎస్పీ జాలక్షేర్మిల బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ బాసర గోదావరి సందర్శించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు రహదారిపై అవుట్ పోస్టింగ్ పోలీసు వ్యవస్థ ఇద్దరు సిబ్బందితో గస్తీ మెట్ల వద్ద పోలీసు అధికారుల విధులు పుష్కర ఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు తదితర అంశాలపై చర్చించి ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటామని చెప్పిన ఇది పక్కాగా అమలు కావడంలేదని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు సమన్వయంతో బాసర గోదావరి వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తారా..?

మూడు నెలల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా అప్పటికప్పుడు అధికారులు స్పందించి రక్షణ చర్య లు చేపడతామని చెప్పిన ఇంతవరకు అది అమలు కావడం లేదని భక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఏడాదిలో 30 వరకు ప్రమాదాలు జరగగా 20 వరకు భక్తులు ప్రాణాలను కోల్పోతున్నారు దైవదర్శనానికి వచ్చి దైవ సన్నిధిలో పూజల కం టే ముందే చనిపోవడంతో ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపుతుంది.  గోదావరిలో ఉన్న నీటి పరిణామం తెలిపే సూచిక బోర్డులు.

మునిగే వారిని రక్షించి గజఈతగాళ్లు లోనికి వెళ్లకుండా ఇంత సంఖ్యల భారీకేర్లు మెట్లపై ఉన్న నల్లమట్టి అడుగుభాగంలో ఉన్న మట్టిదిబ్బలను తొలగిస్తేనే భక్తుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని భక్తు లు పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే అధికారులు ఆ తర్వాత మర్చిపోవడం వల్లనే తరబడి ఇటువంటి ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో భకు లు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.