29-05-2025 12:00:08 AM
- కొనుగోలు కేంద్రాలు వర్షంతో బురదమయం
- దిగబడుతున్న లారీలు చేతులెత్తేస్తున్న డ్రైవర్లు
నిర్మల్, మే 28 (విజయక్రాంతి): కర్ణుడు చావుకు కారణాలు అనేకం అనే రీతిగా నిర్మ ల్ జిల్లాలో వరి ధాన్యం రైతుల పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వారి ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నీరు నిలిచి పంట తడిసిపోవడమే కాకుండా నీలంతా చిత్తడి కావడంతో రైతుల కు అధికారులకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది.
జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికీ 100 కొనుగోలు కేంద్రంలో మాత్రమే వారి ధాన్యం సేకరణ పూర్తి అయ్యింది. జిల్లాలోని ఖానాపూర్ సారంగాపూర్ కుంటాల సోల్ నర్సాపూర్ లోకేశ్వరం మామడ దస్తురాబాద్ తదితర మండలాలు ఇప్పటికీ వరి ధాన్య పనులు కేంద్రాల్లో 20 వేల మెట్రిట్ టన్ను ల ధాన్యం కుప్పలు నిలువ ఉం డడంతో వర్షం కారణంగా అవి తడిసిపోయి తూకం వేయడానికి తీవ్ర జాప్యం జరుగుతున్నది.
ప్రతిరోజు మ బ్బులు కమ్ముకోవడం వర్షాలు కురవడం తో ఆరబెట్టిన పంట తిరిగి ఆరబెట్టగా వర్షాలు కురవడంతో వర్షపు కుప్పల మధ్యకు వచ్చి నిలిచిపోవడంతో ధాన్యం మొత్తం తడిసిపోతుంది. అయితే జోకిన ధాన్యం సంచుల్లో నుంచి లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లు కు తరలించేందుకు కొనుగోలు కేంద్రంలో వృథా నీరు నిలిచిపోవడంతో రవాణా చేసే లారీలు బురదలో ఇరుక్కుపోయి రవాణాకు ఆటంకం కలుగుతుంది.
అసలే కూలీల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో నింపిన బస్తాలు మళ్లీ ఖాళీ చేయవలసి రావడంతో ఆ భారం రైతులపై వేస్తున్నారని కొంద రైతులు ఆరోపిస్తున్నారు. చాలా మండలాలు కొనుగోలు కేంద్రం వరకు వర్షం బురద కారణంగా లారీలు పోయే పరిస్థితి లేకపోగా అక్కడికి వెళ్లిన లారీలు రోడ్డుమీదికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాత బతుకు మరింత ఆగమవుతుంది.
లారీ డ్రైవర్లు మాత్రం మైదాన ప్రాంతానికి వడ్లు తీసుకొస్తేనే లోడ్ చేస్తామని చేతులు ఎత్తడంతో రైతులు అదనపు ఖర్చులు పెట్టి నీటిలో ఉన్న దాన్నే బస్తాలను బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల రైతులు కన్నీటి పర్యవంతమవుతున్నారు.
అధికారులు మా త్రం దాన్యం తరలింపుకు చర్యలు చేపడుతున్న క్షేత్రస్థాయిలో అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో వరి ధాన్యం కోసం మరో వారం రోజులు గడిస్తే గాని తప్పేటట్లు లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.