04-12-2025 08:35:49 PM
చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్..
చిట్యాల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల రిత్యా ప్రతి ఒక్కరూ ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. గురువారం చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు ఎన్నికలకు సంబంధించిన ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని, ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా సామరస్యం పాటించాలన్నారు. చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.