24-01-2026 03:31:37 PM
మునిపల్లి,(విజయక్రాంతి): కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గల్ల సంతోషమ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయానికి నాలుగు ఫ్యాన్లను శనివారం ఎంఈఓ భీంసింగ్ చేతుల మీదుగా విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ భీమ్ సింగ్ ట్రస్ట్ ప్రతినిధులైన శ్రీనివాస్ , సంతోషమ్మ దంపతులను అభినందించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలన్నారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు నీలి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గల్ల సంతోషమ్మ, నాయకులు గోవర్థన్ పాల్గొన్నారు.