28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన

17-05-2025 12:00 AM
  1. తనిఖీ చేసిన తూనీకలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ 
  2. కేసు నమోదు 

పటాన్ చెరు, మే 16 : మండల కేంద్రం జిన్నారంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందంటూ రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో జిల్లా తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.  తూకం వేసిన బస్తాలను అధికారులు తెచ్చిన మిషన్లో  పరిశీలించారు. 

ఒక సంచిలో 750 గ్రాములు మరో సంచిలో 800 గ్రాముల ధాన్యం ఎక్కువగా ఉందని గుర్తించారు. సంచుల్లో ఎక్కువ ధాన్యం నింపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేస్తున్న మోసంపై కేసు నమోదు చేసిన్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కు నివేదిస్తామన్నారు.