25-08-2025 04:04:56 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని మోడీ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న గోదామును తొలగించి నూతనంగా గోదాం నిర్మాణం చేపట్టాలని కోరుతూ రైతులు సోమవారం పద్మాజీవాడి సింగిల్ విండో కార్యదర్శి దేవేందర్ కు వినతిపత్రం అందజేశారు. నూతనంగా గోదాం నిర్మాణం చేపడితే రైతులకు అందుబాటులో ఎరువులు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో ముడేగాం గ్రామానికి చెందిన అన్ని పార్టీల రైతులు పాల్గొన్నారు.