25-08-2025 06:18:29 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఐఎన్టీయుసీ అనుబంధ 327 విద్యుత్ ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ కు మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. శ్రీనివాస్ మృతి పట్ల విద్యుత్ అధికారులు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం తీశారు.