25-08-2025 06:10:34 PM
కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లపై అవలంబిస్తున్న మొండి వైఖరిని విడాలని కోదాడ నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రేషన్ డీలర్లు చెల్లింస్తూ డీలర్లు అర్ధాకలితో అలమటిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన అమలు చేసే సంక్షేమ పథకాల్లో కీలకమైనది ప్రజా పంపిణీ వ్యవస్థనే. రేషన్ డీలర్ల ద్వారా ప్రతినెల రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి సానుకూల వాతావరణం గ్రామాల్లో నెలకొనేందుకు రేషన్ డీలర్లకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కమిషన్లు వచ్చే విధంగా చూడాలని కోరారు.