17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రైతులు దళారులకు ధాన్యం విక్రయించవద్దు

17-10-2025 05:50 PM

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

హుజురాబాద్,(విజయక్రాంతి)రైతులు దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తడికల్, గద్దపాక, మెట్పల్లి, కొత్తగట్టు  సహకార సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రం ద్వారా చివరి గింజ వరకు ధాన్యం కొంటామన్నారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దు అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాన్యం కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది చేస్తే వారిపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.