15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీసీ రిజర్వేషన్లకు బీజేపీనే అడ్డంకి

17-10-2025 08:01 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీజేపీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం దానిని ఆమోదించకుండా ఆపేసిందని విమర్శించారు. బీసీ సంఘాల నాయకులు బీజేపీ తీరును ఖండించాలని, తమ అసలైన రంగును ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో బిల్లును ఎందుకు ఆమోదించలేదో, 9వ షెడ్యూల్‌లో ఎందుకు చేర్చలేదో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. అక్టోబర్ 18న సిపిఎం పార్టీ స్వతంత్రంగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని చాటాలని పిలుపునిచ్చారు.