11 April, 2026 | 3:15 PM

Breaking News

కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •  

సిమెంట్ కర్మాగారంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి..

14-10-2025 07:40 PM

లేదంటే  కర్మాగారం మూయించేస్తాం.. ఎంపీ కొండ 

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లే కాలుష్యంతో పరిసర గ్రామ రైతుల పంట తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన నిర్వహించి మూసేస్తామని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర స్వరంతో అన్నారు. మంగళవారం ఆయన సంగం కలాన్ గ్రామ రైతులకు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా, స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.