15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆదివాసి నాయక పోడ్ కుల దైవం భీమన్న దేవుని ఉత్సవాలు

05-11-2025 08:08 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ భీమన్న గుడి వద్ద బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా పండగ జరుపుకున్నారు. గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి భీమన్న దేవుని గదాలు తీసుకెళ్లి గంగా స్నానం చేయించి, భీమన్న దేవునికి అభిషేకం నిర్వహించారు. గంగ నీళ్లు తీసుకొని వచ్చిన మహిళలు, యువతీ యువకులు, కుల పెద్దలు, కళాబృందం తప్పెట్లతో ఆటపాటలతో ఊరేగింపుగా భీమన్న దేవుని మందిరంకి తీసుకొనివచ్చి, భీమన్న దేవునికి అభిషేకం చేశారు.

భీమన్న దేవునికి అలంకరణ పూజలు చేసిన తర్వాత అన్న ప్రసాదం భక్తులు స్వీకరించారు. పూజ తర్వాత ధర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం అమ్మవారికి బోనాలు, పూజలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామల నాయకపోడ్ కులస్థులు కుటుంబల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి అధ్యక్షులు కొమ్ము రవి కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య, జిల్లా కోశాధికారి సాయిబాబా, కూర్తి రవీందర్ శ్రీనివాస్, శంకర్, సాయిలు, బాలురాజు, సంజీవులు, టీ సాయిలు కాశీరం నారాయణ కుల పెద్దలు, ఉద్యోగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.