17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఉత్తమ సేవలకు ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

27-01-2026 07:16 PM

జైనూర్,(విజయక్రాంతి): ఉపాధిహామీపథకాన్ని సమర్థంగా అమలుచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించినందుకు మండలంలోని మాణిగూడ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మెస్రం మనోహర్‌కు ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మంగళవారం జైనూర్ ఉపాధిహామీ కార్యాలయంలో ఈజీఎస్ ఏపీవోతో పాటు ఉద్యోగులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వకారణమని ఈజీఎస్ ఏపీవో నగేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్లు దుర్గం రాజలింగు, అంబాజీ, ఆత్మరాం, లింగేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం రాజు,ప్రధాన కార్యదర్శి ఆత్రం రవీందర్, సంఘ నాయకులు జాదవ్ పండిత్‌రావు, అంబాజీ, బాబు, దత్తు తదితరులు పాల్గొన్నారు.