8 April, 2026 | 4:08 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

కంగారెత్తిస్తేనే ఫైనల్ బెర్త్

30-10-2025 12:00 AM
  1. నేడు ఆసీస్‌తో భారత్ సెమీఫైనల్
  2. మహిళల వన్డే ప్రపంచకప్

నవీముంబై, అక్టోబర్ 29 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జ ట్టు సెమీఫైనల్‌కు సిద్ధమైంది. గురువారం నవీముంబై వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఈ మెగాటోర్నీని వరుసగా రెండు విజయాలతో ఘనంగా ఆరంభించిన భారత్ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో వెనుకబడింది. అయితే న్యూజిలాండ్‌పై డూ ఆర్ డై పోరు లో చెలరేగి కీలక విజయాన్ని అం దుకోవడమే కాకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.

టైటి ల్ ఫేవరెట్ ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు అంత ఈజీ కాదు. టోర్నీలో అపజయ మే లేని జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన కంగారూలు అన్ని విభా గాల్లోనూ అత్యంత బలంగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్ వరకూ సెమీస్‌కు ముందు భారత్ ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో తప్పుకోవడం ఎదురుదెబ్బ గా మారింది. ఆమె స్థానంలో వచ్చిన షెఫాలీ వర్మ అంచనాలకు తగ్గట్టు రాణించాల్సిం దే.

మిగిలిన బ్యాటింగ్‌లో స్మృతి, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఫామ్‌లో ఉన్నా రు. బౌలింగ్‌లో మాత్రం భారత్ మరింత మెరుగుపడాల్సి ఉంది. క్రాంతి గౌడ్, స్నేహా రాణా, శ్రీచరణి, రేణుకా సింగ్‌పైనే విజయా వకా శాలు ఆధారపడి ఉన్నాయి. 

మ్యాచ్‌కు వర్షం ముప్పు

భారత్,ఆసీస్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశ ముంది. అయితే సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు రిజర్వే డే ఉంది. రిజర్వ్ డేలో కూడా ఆట సాధ్యం కాకుంటే మాత్రం ఆసీస్ ఫైనల్‌కు చేరుతుంది.