20 March, 2026 | 6:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించాలి

28-10-2024 06:28 PM

మందమర్రి (విజయక్రాంతి): దీపావళి పర్వదినం సందర్భంగా టపాసుల దుకాణదారులు సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ శశిధర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్కిల్ పరిధిలో దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాసులు ఇండ్లు, షాపులు, జన సముదాయాల మధ్య గోదాములలో నిల్వ చేసిన, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరిపిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా బాణసంచా విక్రయించే దుకాణదారులు పోలీసుల సూచనలు, నియమ నిబంధనలను పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, దుకాణ యజమానులు దీపావళి సామాగ్రి ఉన్న ప్రదేశాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.