08-06-2025 03:40:48 PM
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, ఆస్తమా నివారణగా చాలా మంది నమ్మే ప్రఖ్యాత 'చేప ప్రసాదం'ని ఆదివారం బత్తిని కుటుంబం పంపిణీ చేస్తోంది. ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నాయకులు ఇవాళ ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు చేప ప్రసాదాన్ని బత్తి కుటుంబ సభ్యులు స్వయంగా అందించారు.
'చేప ప్రసాదం' (మూలికా పేస్ట్తో నింపిన ముర్రెల్ చేప)ను నగరానికి చెందిన బత్తిని కుటుంబం ఒక శతాబ్దానికి పైగా 'మృగశిర కార్తి' రోజున ప్రతి ఏటా అందిస్తోంది. చేప ప్రసాదం ఔషధ వాదనలను శాస్త్రవేత్తలు, హేతువాదులు, ఆరోగ్య నిపుణులు తరచుగా ప్రశ్నించారు. అయితే, ప్రతి సంవత్సరం వేలాది మంది 'ప్రసాదం' స్వీకరించడానికి నగరానికి వస్తారు. నేటీ నుంచి రెండు రోజుల పాటు చేప మందు పంపిణీ జరుగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉదయయం 9 గంటల నుంచి ప్రజలకు చేప ప్రసాదం వేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యుల తీసుకుంటున్నారు.