08-06-2025 04:36:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం(వి) గౌడ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం శ్రీ వివేకవర్ధిని విద్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాబోయే మూడు సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రడం శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కదిర శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా పెదగాని సురేందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఊటుకూరి శ్రీనివాస్ గౌడ్, గాజగోని వీరన్న గౌడ్, కార్యదర్శులుగా చింతనూరి సతీష్ గౌడ్, ఊటుకూరి రవిశంకర్ గౌడ్, సహాయ కోశాధికారిగా మచ్చిక అశోక్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా రడం పెద్ద వెంకన్న గౌడ్, రడం చిన్న వెంకన్న గౌడ్, చిర్ర యాకాంతం గౌడ్, ఊటుకూరి అశోక్ గౌడ్, కొత్త శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రడం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్స్ అందరూ ఐకమత్యంతో మెలగాలని జనాభా దామాషా ప్రకారం మన వాటాను మనం సాధించుకోవాలని, రాజ్యాధికారంలో వాటా సాధించాలని అందుకోసం గౌడ కులస్తులందరూ ఐకమత్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.