16 April, 2026 | 11:22 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి

15-10-2025 04:19 PM

మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్

చిట్యాల,(విజయక్రాంతి): పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలోని 250 పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలను వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత గాలి కుంటు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమాన్ని 3 నెలలు దాటిన అన్ని ఆవు,గేదె జాతి పశువులకు గాలికుంటు టీకాలు వేపించూకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ సిబ్బంది కవిత, దివ్య, కరుణాకర్, సుజాత, గోపాలమిత్ర లక్ష్మణ్, పశుమిత్ర రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.