18 April, 2026 | 10:58 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

దిగ్విజయంగా ప్రారంభమైన ఎఫ్ఎల్ఎన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమం

20-05-2025 06:35 PM

కామారెడ్డి (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ ప్రాథమిక స్థాయి శిక్షణ కార్యక్రమం కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం ఎంఈఓ శోకత్ అలీ(MEO Shaukat Ali) అధ్యక్షతన, రిసోర్స్ పర్సన్ ల పర్యవేక్షణలో అట్టహాసంగా ప్రారంభమైంది. సమావేశాన్ని ఉద్దేశించి ఎంఈఓ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా బోదనల్లో మార్పులు చేసుకుంటూ, నాణ్యమైన విద్యను అందించడానికి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సబ్జెక్ట్ ల MRP లు రాములు, మహిపాల్, దామోదర్ సంజీవ్, మాధురి, రాములు, గోపాల్, చంద్రశేఖర్, లింగంపేట్ మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు, MRC సిబ్బంది పాల్గొన్నారు.